Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితులతో కలిసి భార్యపై అసహజ రీతిలో అత్యాచారం...

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (08:38 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఆమె భర్తే కావడం గమనార్హం. తన స్నేహితులతో కలిసి కట్టుకున్న భార్యపై అసహజరీతిలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై రహస్య భాగాల్లో సిగరెట్లతో కాల్చారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అత్యాచారానికి పాల్పడిన భర్తతో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌ నగరంలో ఈ దారుణం జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ ద్వారా ఇండోర్‌కు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతను చిత్ర హింసలకు గురిచేయసాగాడు. 
 
ఈ క్రమంలో తాజాగా తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడటమేకాకుండా ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. ఈ కామాంధుల నుంచి తప్పించుకున్న బాధితురాలు స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
ఇండోర్‌లోని పిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫాంహౌస్‌లో నవంబరు 2019, అక్టోబరు 2021లలో భర్త, అతని స్నేహితులు తనపై అత్యాచారం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసహజరీతిలో తనపై అత్యాచారం చేశారని, ఆపై సిగరెట్లతో తన ప్రైవేట్ భాగాల్లో కాల్చి చిత్రహింసలకు గురిచేశారని బోరున విలపిస్తూ చెప్పింది. 
 
వారిని ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా, చంపేస్తామని బెదిరించారని వాపోయింది. ఏదో విధంగా అక్కడ నుంచి తప్పించుకుని పుట్టింటికి వెళ్ళినప్పటికీ.. ఒక నిందితుడు మాత్రం తనను అనుసరిస్తూనే చంపేందుకు ప్రయత్నించాడని పేర్కొంది. దీంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

మజాకా సెన్సార్ పూర్తి- యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డ్

సకెస్స్ కోసం రెండు సినిమాల షూటింగ్ లు చేస్తున్న రవితేజ

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments