Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్లమ్మకు పొట్టేలుకు బదులు మనిషిని బలిచ్చారు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (08:14 IST)
తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబంరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడకల్లో చిన్నాపెద్దా, ఊరువాడా అనే తేడా లేకుండా కలిసిపోయి పెద్ద పండుగను జరుపుకున్నాయి. అయితే, చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం వలసపల్లెలో ఓ విషాదం జరిగింది. స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద జరిగిన వేడుకల్లో పొట్టేలుకు బదులుగా మనిషిని బలిచ్చారు. ఇది స్థానికంగా సంచలనమైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వలసపల్లె గ్రామంలో సంప్రదాయంగా వస్తున్న పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత ఎల్లమ్మ ఆలయం వద్ద పొట్టేలును బలి ఇచ్చేందుకు స్థానికులు సిద్ధమయ్యారు. పొట్టేలును అమ్మవారికి బలిచ్చేముందు అక్కడున్నవారంతా పీకల వరకు మద్యం సేవించారు. ఆ తర్వాత పొట్టేలు తల తెగనరికే క్రమంలో 35 యేళ్ల సురేష్ అనే వ్యక్తి పొట్టేలును గట్టిగా పట్టుకున్నాడు. 
 
మద్యంమత్తులో ఉన్న మరో వ్యక్తి పొట్టేలు తల నరకకుండా ప్రమాదవశాత్తు దానిని పట్టుకున్న సురేష్ అనే వ్యక్తి తల తెగనరికాడు. దీంతో సురేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో పశువుల పండుగలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ వేడుకల్లో పాల్గొన్నవారంతా భయంతో పరుగులు తీశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments