Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్లమ్మకు పొట్టేలుకు బదులు మనిషిని బలిచ్చారు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (08:14 IST)
తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబంరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడకల్లో చిన్నాపెద్దా, ఊరువాడా అనే తేడా లేకుండా కలిసిపోయి పెద్ద పండుగను జరుపుకున్నాయి. అయితే, చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం వలసపల్లెలో ఓ విషాదం జరిగింది. స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద జరిగిన వేడుకల్లో పొట్టేలుకు బదులుగా మనిషిని బలిచ్చారు. ఇది స్థానికంగా సంచలనమైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వలసపల్లె గ్రామంలో సంప్రదాయంగా వస్తున్న పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత ఎల్లమ్మ ఆలయం వద్ద పొట్టేలును బలి ఇచ్చేందుకు స్థానికులు సిద్ధమయ్యారు. పొట్టేలును అమ్మవారికి బలిచ్చేముందు అక్కడున్నవారంతా పీకల వరకు మద్యం సేవించారు. ఆ తర్వాత పొట్టేలు తల తెగనరికే క్రమంలో 35 యేళ్ల సురేష్ అనే వ్యక్తి పొట్టేలును గట్టిగా పట్టుకున్నాడు. 
 
మద్యంమత్తులో ఉన్న మరో వ్యక్తి పొట్టేలు తల నరకకుండా ప్రమాదవశాత్తు దానిని పట్టుకున్న సురేష్ అనే వ్యక్తి తల తెగనరికాడు. దీంతో సురేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో పశువుల పండుగలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ వేడుకల్లో పాల్గొన్నవారంతా భయంతో పరుగులు తీశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments