Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త చెడు వ్యసనాలు తట్టుకోలేక మరొక వ్యక్తితో శారీరక సంబంధం, అతను కూడా...?

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (19:51 IST)
హర్యానాలోని కురుక్షేత్రజిల్లా బోహ్లి ప్రాంతమది. పింకీకి అదే ప్రాంతానికి చెందిన రవితో పదేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భర్త డ్రగ్స్‌కి బానిసయ్యాడు. సంపాదించిన డబ్బంతా దానికే ఖర్చు పెట్టేవాడు. ఇంట్లో తినడానికి తిండి కూడా లేకపోయినా పట్టించుకునేవాడు కాదు.
 
దీంతో అతనితో విబేధించి పిల్లలను తీసుకుని బయటకు వచ్చేసింది అతడి భార్య. థానేసర్ లోని ఆకాష్ నగర్లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుంది. ఐతే ఆమెపై ఇంటి యజమాని గంగాసింగ్ కన్నేశాడు. అసలే ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వుండటతో అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కూలి పనిచేసుకుంటూ పిల్లలను చదివిస్తూ ఉండేది. పిల్లలకు అనుమానం రాకుండా ఇంటి యజమానితో సంబంధాన్ని కొనసాగించేది. 
 
అయితే గంగాసింగ్ కూడా మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో ఉన్న డబ్బులను ఖర్చు చేసి పింకీ దగ్గరకు వచ్చి ఆమె దగ్గరకు డబ్బులు తీసుకెళ్ళేవాడు. ఏమయినా ఎదురుతిరిగి మాట్లాడితే తమ మధ్య వున్న సంబంధం బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. కష్టపడి పనిచేసిన డబ్బును గంగాసింగ్ తీసుకెళ్ళి తాగేయడంతో మొదట్లో తాను ఎదుర్కొన్న పరిస్థితే మళ్ళీ ఆమెకు ఎదురైంది. గంగాసింగ్ పైన కోపం తెచ్చుకుంది.
 
అతనిపై చేయి చేసుకుంది. దీంతో గంగాసింగ్ ఆమెను ఎలాగైనా చంపేయాలనుకున్నాడు. పూటుగా మద్యం సేవించి నేరుగా ఇంటికి వచ్చి ఆమెను గోడకేసి కొట్టి చంపేశాడు. ఆ తర్వాత నిందితుడు నేరుగా స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments