Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కొద్దిరోజులకే కట్నం తేవాలన్నాడు.. భార్య?

Webdunia
సోమవారం, 15 జులై 2019 (20:01 IST)
ప్రేమించి వివాహం చేసుకుని.. భార్యను చిత్ర హింసలకు గురిచేశాడు. చివరికి భర్త వేధింపులు తాళలేక ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ జిల్లాకు చెందిన షోయబ్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన మిస్బా అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు మధ్య కొద్ది రోజుల్లోనే విబేధాలు తలెత్తాయి. ఈ మనస్పర్ధల కారణంగా ప్రేమించి వివాహం చేసుకున్న భార్యను భర్త చిత్ర హింసలకు గురిచేశాడు. 
 
వరకట్నం కోసం వేధించడం మొదలెట్టాడు. దీంతో పుట్టింటికి వెళ్లిపోయిన మిస్బా.. భర్త హింసలను తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు షోయబ్‌‍ను అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో వివాహం చేసుకుని వరకట్నం కోసం వేధింపులకు గురిచేసిన షోయబ్‌ను కఠినంగా శిక్షించాలని మిస్బా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments