Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో దెయ్యం.. హాస్టల్ ఖాళీ చేస్తున్న విద్యార్థులు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 15 జులై 2019 (19:49 IST)
దెయ్యం భయంతో హాస్టల్‌లో వుంటున్న విద్యార్థులు ఖాళీ చేసి పారిపోతున్నారు. ఈ ఘటన ఏపీలో కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏపీ, కర్నూలు జిల్లాలోని ఓ మోడల్ స్కూల్‌లో దెయ్యముందంటూ విద్యార్థులు జడుసుకుంటున్నారు. ప్రభుత్వ ఆధీనంలోని ఈ స్కూల్, హాస్టల్ ప్రాంతాల్లో దెయ్యం సంచరిస్తుందని.. విద్యార్థినులు వాపోతున్నారు. 
 
ఈ మోడల్ స్కూల్‌లో చేరే విద్యార్థులు తప్పనిసరిగా హాస్టల్‌లో చేరాల్సిందే. ఈ క్రమంలో వంద మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో హాస్టల్‌లు రకరకాల శబ్ధాలు వినవస్తున్నాయని విద్యార్థులు చెప్తున్నారు. అదీ రాత్రి పూట వినిపించే శబ్ధాలకు విద్యార్థినులు జడుసుకుంటున్నారు. 
 
ఈ విషయాన్ని తల్లిదండ్రులతో విద్యార్థులు తెలపడం ద్వారా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీరిలో కొంతమంది విద్యార్థినులు హాస్టల్ ఖాళీ చేసుకుని ఇంటికి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఈ స్కూల్ మొత్తం ఖాళీ అయిపోయిందని.. విద్యార్థినులకు ఎంత నచ్చజెప్పినా దెయ్యం భయంతో విద్యార్థులు ఆ పాఠశాలకు దూరమయ్యారని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments