Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 31లోపు అనుసంధానం చేసుకోవాలి.. లేకుంటే రూ.1000 నుంచి రూ.10 వేల వరకు అపరాధం

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (13:47 IST)
ఈ నెలాఖరు లోగా పాన్ కార్డు - ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలని లేనపక్షంలో రూ.1000 నుంచి రూ.10 వేల వరకు అపరాధం చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు కార్డుల అనుసంధానం కోసం ఈ నెల 31వ తేదీ వరకు డెడ్‌లైన్ విధించిన విషయం తెల్సిందే. ఈ గడువులోగా పాన్ కార్డు, ఆధార్ కార్డు లింకప్ చేయని పక్షంలో పాన్ కార్డు నిరుపయోగంగా మారిపోతుంది. డెడ్‌లైన్ తర్వాత ఈ రెండు కార్డులను అనుసంధానం చేసుకోవాలంటే వెయ్యి రూపాయల నుంచి రూ.10 వేల వరకు అపరాధం చెల్లించి లింకప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ రెండు కార్డుల అనుసంధానం కోసం గడువును పలుమార్లు పొడగించిన విషయం తెల్సిందే. అయితే, ఈ నెలాఖరు తర్వాత ఈ గడువును కేంద్ర ప్రభుత్వం పొడగిస్తుందో లేదో వేచి చూడాల్సివుంది. అనుసంధానం ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. 
 
ముందుగా వెబ్‌బ్రౌజర్‌లో ట్యాక్స్ ఈ-ఫిల్లింగ్ అధికారిక పోర్టల్ https://www.incometax.gov.in అనే వెబ్‌సైట్లోకి వెళ్లారి. ఆ తర్వాత క్విక్ లింక్ అనే సెక్షన్‌లో లింక్ ఆధార్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. 
 
అలా చేసిన తర్వాత పాన్ నంబరు, ఆధార్ నంబరు, ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు, మొబైల్ నంబరును ఎంటర్ చేయాలి. ఆ తర్వాత నింబంధనలను అంగీకరిస్తున్నట్టుగా బాక్స్‌లో టిక్ చేయాలి. ఆ తర్వాత కింద ఉండే లింక్ ఆధార్ బటన్‌ను క్లిక్ చేస్తే మీ పాన్ కార్డు, ఆధార్ కార్డులు లింకు అయినట్టుగా ఆధార్ కార్డు‌లోని మొబైల్ నంబరుకు ఓ ఎస్ఎంఎస్ వస్తుంది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments