Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదు

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (13:20 IST)
అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 5.07 గంటల సమయంలో ఈ రీజియన్‌లో భూప్రకంపనలు కనిపించాయి. ఇవి రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదయ్యాయి. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. 
 
ఈ భూకంప కేంద్రాన్ని పెర్కాకు 208 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని కేంద్రం తెలిపింది. ఈ భూ ప్రకంపనల ప్రభావం ఇండోనేషియాలో కూడా కనిపించాయని వెల్లడించింది.
 
మరోవైపు, ఆదివారం తెల్లవారుజామున 12.45 గంటల సమయంలో ఉత్తర కాశీలో వరుసగా మూడుసార్లు భూమి కంపించిన విషయం తెల్సిందే. రెండుసార్లు 5 తీవ్రతతో భూకంపం వచ్చిందని ఎన్.సి.ఎస్ వెల్లడించింది. భట్వారీ ప్రాంతంలోని సిరోర్ అడవిలో తొలుత 12.40 గంటలకు భూమి కంపించిందని ఆ తర్వాత రెండోసారి 12.45 గంటలకు, మూడోసారి 1.05 గంటలకు భూకంపం వచ్చినట్టు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండేల్‌కు బెనిఫిట్ షోలు లేవు.. అంత బెనిఫిట్ మాకొద్దు : అల్లు అరవింద్

Latha Mangeshkar: లతా మంగేష్కర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఐదేళ్లలోనే ఆమె ప్రతిభ అలా..?

Tamannaah Bhatia- తమన్నా భాటియా విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసిందా?

తలసేమియా భాదితుల కోసం తమన్ మ్యూజికల్ నైట్ : నారా భువనేశ్వరి

సిద్ధార్థ్, శ్రీ గణేష్, శరత్‌కుమార్, దేవయాని మూవీ టైటిల్ 3 BHK

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments