Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్లు నెలకు ఒకసారైనా ఉతుకుతారు : రైల్వే మంత్రి

ఠాగూర్
గురువారం, 28 నవంబరు 2024 (15:34 IST)
రైలు ఏసీ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్లను నెలకు ఒకసారైనా ఉతుకుతారని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుడు కుల్దీప్ ఇండోరా అడిగిన ప్రశ్నకు మంత్రి పైవిధంగా సమాధానిమిచ్చారు. భారతీయ రైల్వేలో ఉపయోగించే దుప్పట్లు తేలికగా, సులభంగా ఉతకవచ్చని మంత్రి తెలిపారు. రైళ్లలో ప్రయాణికుల సౌకర్య, భద్రతను నిర్ధారించడానికి తీసుకున్న ఇతర చర్యల గురించి కూడా మంత్రి సభకు తెలిపారు. 
 
రైళ్లలో ప్రయాణించే అనేక మంది ప్రయాణికులకు తరచుగా ఇదే సమస్య ఎదురవుతుంది. ప్రస్తుతం ఇదే అంశంపై పార్లమెంటులో ప్రశ్నించడం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు దీనికి రైల్వే మంత్రి వివరంగా సమాధానం చెప్పడం కూడా అనేక మందిని ఆకర్షించింది. ఈ సమాధానం చూసిన అనేక మంది పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది బెడ్ షీట్లను నెలకు ఒక్కసారైనా ఉతుకుతున్నారని అంటుండగా, మరికొంత మంది మాత్రం నెలకు రెండు సార్లు వాష్ చేయాలని కోరుతున్నారు. ఇంట్లో మాదిరిగా నెలకు ఓసారి ఉతికితే చాలని ఇంకొంత మంది కామెంట్లు చేయడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments