Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు- కొట్టుకుపోయిన గ్రామం.. ఆరుగురు మృతి.. 53మంది గల్లంతు

వరుణ్
ఆదివారం, 4 ఆగస్టు 2024 (09:32 IST)
Himachal Pradesh
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు, మండి, సిమ్లాలలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల మేఘాలు కమ్ముకున్నాయి. వరదల కారణంగా చాలా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 60కి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. వరదల్లో మృతి చెందిన ఆరుగురి  మృతదేహాలను ఇప్పటి వరకు వెలికి తీశారు.
 
వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన సమాజ్ గ్రామానికి చెందిన అనితా దేవి మాట్లాడుతూ, "మేము రాత్రి నిద్రపోతున్నాం అప్పుడు ఒక్కసారిగా భయంకరమైన శబ్ధం వినిపించి ఇల్లు కంపించింది. బయటకు చూసే సరికి ఊరు జలమయమైంది.
 
ఆ తర్వాత వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి సమీపంలోని భగవతి కాళి ఆలయంలో తలదాచుకున్నాం. రాత్రంతా అక్కడే ఉండిపోయాం. మా ఇల్లు మాత్రమే బయటపడింది. మా ఊరిలోని ఇళ్లన్నీ నా కళ్ల ముందే కొట్టుకుపోయాయి." అని బాధితులు వాపోయారు. 
 
ఇప్పటి వరకు తప్పిపోయిన వారి సంఖ్య సిమ్లాలో అత్యధికంగా 33 మంది ఉండగా, కులు తొమ్మిది మంది, మండిలో ఆరుగురు ఉన్నారు. మొత్తం 55 మందిని సహాయక శిబిరాలకు తరలించగా, 25 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. ఇంకా 61 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments