Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరెస్టు భయంతో దుబాయ్‌కు పారిపోయిన పూజ్ ఖేడ్కర్!!

Advertiesment
pooja

సెల్వి

, శనివారం, 3 ఆగస్టు 2024 (10:54 IST)
వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు అరెస్టు భయం పట్టుకుంది. తప్పుడు ధృవీకరణ పత్రాల సమర్పణ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె దేశం దాటిపోయినట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె మొబైల్ ఫోన్ స్విచాఫ్ అని వస్తుంది. ఆమె దుబాయ్‌కు పారిపోయివుంటారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 
 
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన కేసులో ఆమె తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించి నేపథ్యంలో పోలీసులు ఆమె కోసం గాలింపు మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆమె తన ఫోన్‌ను స్విచాఫ్ చేశారు. ఈ నేపథ్యంలో అరెస్టు తప్పదని భావించిన ఆమె దుబాయ్‌కు పారిపోయినట్టు తెలుస్తుంది. 
 
మరోవైపు, పూజ వివాదం నేపథ్యంలో మరో ఆరుగురు ఐఏఎస్ అధికారుల వైకల్య పత్రాలపైనా అనుమానాలు వస్తున్నాయి. కేంద్రం కేంద్ర సిబ్బంది, శిక్షణశాఖ (డీపీటీవో) వారి పత్రాలను పరిశీలించనున్నట్టు సమాచారం. కాగా, ఇటీవల పూజ ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. తమ ఎదుట హాజరు కావాలన్న ఆదేశాలను ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, భవిష్యత్తులోనూ ఆమె యూపీఎస్సీ పరీక్షలు, నియామకాల్లో పాల్గొనకుండా శాశ్వతంగా నిషేధం విధించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్‌ను తొలగించిన కేంద్రం...