Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండిపోతున్న ఎండలు.. వేసవి సెలవులు పొడగింపు

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (15:33 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు ఇచ్చిన వేసవి సెలవులను పొడగించింది. వాస్తవానికి మార్చి, ఏప్రిల్ నెలలో జరిగిన పబ్లిక్ పరీక్షల తర్వాత వేసవి సెలవులు ఇచ్చారు. జూన్ ఒకటో తేదీ స్కూల్స్ తెరుచుకుంటాయని ప్రకటించారు. అయితే, వేసవి ఎండలు తీవ్ర స్థాయిలో ఉండటంతో ఈ సెలవులను తొలుత వారం రోజుల పాటు పొడగించారు. అంటే ఏడో తేదీ నుంచి తెరుస్తామని ప్రకటించారు. 
 
అయినప్పటికీ ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. పైగా, వచ్చే మూడు నాలుగు రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మరో వారం రోజుల పాటు ఈ సెలవులను పొడగించింది. ఆ ప్రకారంగా ఈ నెల 14వ తేదీ బుధవారానికి వాయిదా వేసింది. 
 
2023-24 విద్యా సంవత్సరానికిగాను ఆరు నుంచి పది తరగతులకు, ఇంటర్ విద్యార్థులకు మాత్రం జూన్ 12వ తేదీన, 1 నుంచి 5వ తరగతులకు చెందిన విద్యార్థులకు జూన్ 14వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖామంత్రి అన్బిల్ మహేశ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Subhalekha Sudhakar: బాలు, షిన్నోవా నటించిన ఒక బృందావనం సినిమా సమీక్ష

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments