Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

ఐవీఆర్
శుక్రవారం, 10 జనవరి 2025 (22:37 IST)
ఇదివరకు 50 ఏళ్ల పైబడినవారికి గుండెపోటు వంటివి వచ్చి హఠాన్మరణం చెందే సంఘటనలు చూస్తుండేవాళ్లం. ఇప్పుడు అసలు వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు కూడా గుండెపోటు సమస్యలతో మృత్యువాత పడుతున్నారు. శుక్రవారం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులోని థాల్తేజ్ ప్రాంతంలోని జెబార్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న బాలిక గుండెపోటుతో మృతి చెందింది.
 
స్కూలు ఆవరణకు రాగానే చిన్నారి తన ఛాతీలో నొప్పిగా వుందని చెప్పింది. ఇంతలో మిగిలిన విద్యార్థులతో కలిసి కారిడార్లో నడుస్తూ వెళ్లి అస్వస్థతగా వుండటంతో కుర్చీలో కూర్చున్నట్లు సిసి కెమేరాలో కనబడుతోంది. అలా కూర్చున్న చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అది గమనించిన పాఠశాల సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ప్రాణాలు కోల్పోయింది. చిన్నారికి అనారోగ్య సమస్యలు ఏవీ లేవని ఆమె తల్లిదండ్రులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments