Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రియుడిపై యాసిడ్ పోసిన యువతి.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
ఆదివారం, 6 అక్టోబరు 2024 (15:44 IST)
తన మాజీ ప్రియుడుపై ఓ యువతి యాసిడ్ పోసింది. బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడుతుండటంతో ఈ ఘాతునికి పాల్పడింది. దీంతో మాజీ ప్రియుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆలీగఢ్‌ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అలీగఢ్‌లోని ఓ రెస్టారెంట్‌కు శనివారం ఉదయే ఓ యువతి వచ్చింది. ఆ తర్వాత కాసేపటికి యువకుడు వచ్చాడు. ఇద్దరూ ఓ టేబుల్ వద్ద కూర్చొని టిఫిన్‌కు ఆర్డర్ చేసి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో యువతి తన హ్యాండ్ బ్యాగులో నుంచి యాసిడ్ బాటిల్ తీసి యువకుడి ముఖంపై చల్లింది. దీంతో తీవ్రగాయాలపాలైన యువకుడు అక్కడ నుంచి పారిపోయాడు. ఆ యువకుడు తన మాజీ ప్రియుడని, తనను బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుండటంతో తట్టుకోలేకే ఇలా చేశానని యువతి చెప్పింది. 
 
తనకు ఇదివరకే వివాహం జరిగిందని, విడాకులు తీసుకున్నానని పోలీసులకు వెవిరించింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడికి దగ్గరయ్యానని, అతడి తీరు నచ్చక దూరంగా ఉంటున్నట్టు వెల్లడించింది. అయితే, తాము విడిపోయినా తనను వేధిస్తుండటంతో తట్టుకోలేక ఈ పనికి పాల్పడినట్టు తెలిపింది. కాగా, ఈ దాడిలో యువతికి కూడా యాసిడ్ గాయాలయ్యాయని, పోలీసులు చెప్పారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స చేయించాక అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments