Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాజీ ప్రియురాలి ఇంటికి బాంబు పార్శిల్ బాంబు - భర్త, కుమార్తె మృతి

sadist

ఠాగూర్

, శుక్రవారం, 3 మే 2024 (17:56 IST)
తన మాజీ ప్రియురాలైన వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు ఓ పార్శిల్ బాంబును పంపించాడు. ఈ బాంబు పేలడంతో ఆ మహిళ భర్త, కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడాలిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జీతూభాయ్ హీరాభాయ్ వంజారా(32) అనే వ్యక్తి కుటుంబంతో సహా వడాలిలో నివసిస్తూ కూలి పని చేసుకుంటూ జీవితం సాగిస్తున్నారు. గురువారం వారి ఇంటికి టేప్ రికార్డర్ వంటి పరికరం పార్సిల్‌ రావడంతో దానిని తీసుకున్న జీతూభాయ్, అతని కుమార్తె భూమిక(12) ఆన్‌ చేయడానికి ప్రయత్నించగా అది ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో జీతూభాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన భూమికను స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె కూడా మృతి చెందింది. మరో ఇద్దరు కుమార్తెలకు గాయాలవడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు అతడి భార్య ఇంట్లో లేకపోవడంపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
 
సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఇంటికి ప్యాకేజీని డెలివరీ చేసిన రిక్షా డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వాంగ్మూలం ఆధారంగా నిందితుడు జయంతిభాయ్ బాలుసింగ్ వంజారా (31) ను అరెస్టు చేశామన్నారు. అతడు రాజస్థాన్‌కు వెళ్లి బాంబు తయారీకి అవసరమైన పదార్థాలు కొనుగోలు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. టేప్‌ రికార్డర్‌ ప్లగ్‌ ఆన్‌ చేసిన వెంటనే అది పేలేలా బాంబును రూపొందించాడని వారు పేర్కొన్నారు. తన ప్రియురాలిని జీతూభాయ్‌ వివాహం చేసుకున్నాడనే కారణంతోనే అతడిని హత్య చేయడానికి నిర్ణయించుకున్నానని నిందితుడు తెలిపాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివేకా హత్య కేసుపై మాట్లాడరాదా? 8లోపు నతగు నిర్ణయం తీసుకోండి... కింది కోర్టుకు హైకోర్టు