Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాసిడ్ బాధితుల కోసం సామాజిక ఉద్దేశంతో బ్యూటీ పేజెంట్ నిర్వహణ

Models
, శనివారం, 14 అక్టోబరు 2023 (21:50 IST)
విండో ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు నిర్వహిస్తున్న మిస్ అండ్ మిసెస్ గోల్డెన్ ఫేస్ ఆఫ్ సౌత్ ఇండియా 2023 బ్యూటీ పజంట్ ద్వారా యాసిడ్ దాడి బాధిత మహిళలకు చర్మ దానంపై అవగాహన కల్పించేందుకు సామాజిక ప్రయోజనం కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఈ సామాజిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో అక్టోబర్ 14న లెమన్ ట్రీ గచ్చిబౌలిలో ఆడిషన్స్ విజయవంతంగా జరిగాయి. చెన్నై, బెంగళూరు మరియు కొచ్చికి సంబంధించిన ఆడిషన్స్ పూర్తయ్యాయి.
 
యాసిడ్ దాడి బాధితులతో కలిసి నవంబర్ మొదటి వారంలో చెన్నైలో ఫైనల్స్ జరుగనుంది. ఈ గ్రాండ్ సోషల్ కాజ్ ఈవెంట్‌లో పలువురు మీడియా ప్రముఖులు, సినీ తారలు భాగస్వాములయ్యారు. కంపెనీ వ్యవస్థాపకులు- మేనేజింగ్ డైరెక్టర్ గోపీనాథ్ రవి, శరవణన్ గారు తమవంతు బాధ్యతగా ఎంతో గొప్ప ఉద్దేశంతో మోడల్స్‌తో కలిసి వారు కూడా స్కిన్ డొనేట్ చెయ్యనున్నారు. ఇలాంటి ఒక మంచి ఆలోచనతో నిర్వహించే ఈ పోటీలు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మరెన్నో గొప్పగొప్ప కార్యక్రమాలు వారు చేపట్టాలని ఆశిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరటి పువ్వుకి అంత శక్తి వున్నదా?