Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల వ్యాపారం కోసం ఏకంగా హెలికాప్టర్‌నే కొనేశాడు..

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (09:10 IST)
మహారాష్ట్రలోని భివాండికి చెందిన రైతు పాల వ్యాపారం కోసం ఏకంగా హెలికాప్టర్‌నే కొనేశాడు. రైతు రూ.30 కోట్లు ఖర్చు పెట్టి హెలికాప్టర్‌ కొనడంతో ఈ విషయం తెలిసిన వారందరూ అవాక్కయ్యారు.

వివరాల్లోకి వెళితే.. జనార్ధన్‌ భోయిర్‌ అనే రైతు ఈ మధ్యే పాల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తన వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు పంజాబ్‌, హర్యానా, రాజస్తాన్‌, గుజరాత్‌లోని పలు ప్రాంతాలకు తరచూ వెళ్లాల్సి వచ్చేది. అయితే ఆయన వెళ్లే ప్రాంతాల్లో ఎయిర్‌పోర్ట్‌ సదుపాయం లేకపోవడంతో రైళ్లు, బస్సుల్లో వెళ్తుండేవాడు.

దీంతో సమయం ఎక్కువగా వధా అవుతుండటంతో స్నేహితుడి సలహా మేరకు ఓ హెలికాప్టర్‌ను కొనుగోలు చేశాడు. ఇప్పటికే హెలికాప్టర్‌ను తన గ్రామానికి తీసుకొచ్చి ట్రయల్స్‌ కూడా వేశారట. 2.5 ఎకరాల స్థలంలో హెలికాఫ్టర్‌ కోసం ప్రొటెక్టివ్‌ వాల్‌ను నిర్మించాడు.

మార్చి 15న హెలికాప్టర్‌ను జనార్ధన్‌ ఇంటికి డెలీవరీ చేస్తామని అధికారులు తెలిపారు. వ్యవసాయం, డైరీ బిజినెస్‌లతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా చేసే జనార్ధన్‌కు దాదాపు రూ.100 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments