Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రిపై బాంబు దాడి.. పరిస్థితి విషమం

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రిపై బాంబు దాడి.. పరిస్థితి విషమం
, గురువారం, 18 ఫిబ్రవరి 2021 (07:35 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర మంత్రిపై బాంబుదాడి జరిగింది. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఆ మంత్రి పేరు జాకీర్ హుస్సేన్. ఈ బాంబు దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 
 
బుధవారం రాత్రి 10 గంటల సమయంలో కోల్‌కతా వెళ్లేందుకు ముర్షిదాబాద్ జిల్లాలోని నిమ్తితా రైల్వే స్టేషన్‌లో మంత్రి వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆయనపై బాంబులు విసిరారు. బాంబు పేలుళ్లతో రైల్వే స్టేషన్ దద్దరిల్లింది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది భయంతో పరుగులు తీశారు. 
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మంత్రిని జంగీపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మంత్రితోపాటు మరో ఇద్దరు గాయపడ్డారు. మంత్రి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఊపందుకున్న షర్మిల కొత్త పార్టీ స్థాపన చర్యలు... సలహాదారుల నియామకం