Webdunia - Bharat's app for daily news and videos

Install App

online games ఆడి అప్పుల్లో ఇరుక్కున్నాడు, అడిగినందుకు భార్యాపిల్లల్ని చంపేసి...

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (18:37 IST)
వ్యసనం అనేది ఎంతటి దారుణానికైనా దారితీస్తుంది. అందులో ఇరుక్కున్నవారికి మానవత్వం నశించి మృగంలా మారిపోతారు. అలాంటి స్థితిలోకి వెళ్లిపోయిన ఓ వ్యక్తి తన భార్యాపిల్లల్ని కడతేర్చి తను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెన్నైలోని పెరుంగుడి పెరియార్ నగర్ లోని ఓ అపార్టుమెంటులో మణికంఠన్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నాడు. చెన్నైలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఇతడు గత రెండు నెలలుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే వుంటూ ఆన్లైన్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టాడు.

 
ఇందుకోసం డబ్బును పెట్టి రాబట్టాలని చూసాడు. ఐతే ఆ గేమ్ ఆడుతూ వున్న డబ్బు మొత్తం పోగొట్టుకోవడమే కాకుండా తనకు తెలిసిన వ్యక్తుల వద్ద కూడా అప్పులు చేసాడు. ఈ విషయమై అతడిని భార్య నిలదీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి భార్యను హత్య చేసేసాడు.

 
ఆ తర్వాత తన ఇద్దరి పిల్లల్ని కూడా దారుణంగా చంపేసి అతడూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన 31వ తేదీ జరగ్గా, తెల్లవారినా తలుపులు తీయకపోవడంతో అనుమానంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారమిచ్చారు. అపార్టుమెంట్ తలుపులు తెరిచి మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments