online games ఆడి అప్పుల్లో ఇరుక్కున్నాడు, అడిగినందుకు భార్యాపిల్లల్ని చంపేసి...

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (18:37 IST)
వ్యసనం అనేది ఎంతటి దారుణానికైనా దారితీస్తుంది. అందులో ఇరుక్కున్నవారికి మానవత్వం నశించి మృగంలా మారిపోతారు. అలాంటి స్థితిలోకి వెళ్లిపోయిన ఓ వ్యక్తి తన భార్యాపిల్లల్ని కడతేర్చి తను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెన్నైలోని పెరుంగుడి పెరియార్ నగర్ లోని ఓ అపార్టుమెంటులో మణికంఠన్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నాడు. చెన్నైలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఇతడు గత రెండు నెలలుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే వుంటూ ఆన్లైన్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టాడు.

 
ఇందుకోసం డబ్బును పెట్టి రాబట్టాలని చూసాడు. ఐతే ఆ గేమ్ ఆడుతూ వున్న డబ్బు మొత్తం పోగొట్టుకోవడమే కాకుండా తనకు తెలిసిన వ్యక్తుల వద్ద కూడా అప్పులు చేసాడు. ఈ విషయమై అతడిని భార్య నిలదీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి భార్యను హత్య చేసేసాడు.

 
ఆ తర్వాత తన ఇద్దరి పిల్లల్ని కూడా దారుణంగా చంపేసి అతడూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన 31వ తేదీ జరగ్గా, తెల్లవారినా తలుపులు తీయకపోవడంతో అనుమానంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారమిచ్చారు. అపార్టుమెంట్ తలుపులు తెరిచి మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments