Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెత్త పోలీసింగ్ : ఢిల్లీ పోలీసులపై హైకోర్టు సీరియస్

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (13:36 IST)
కేంద్ర హోం శాఖ పరిధిలోని ఢిల్లీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెత్త పోలీసింగ్ అంటూ మండిపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంపై బీజేపీ, దాని అనుబంధ సంఘాలకు చెందిన కార్యకర్తలు చేసిన దాడికి పోలీసులే కారమణంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పోలీసులై వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలిపింది. 
 
"ది కాశ్మీర్ ఫైల్స్" సినిమాపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ యువమోర్ఛా గత నెల 30వ తేదీన సీఎం నివాసంపై దాడి జరిగింది. బారికేడ్లను తొలగించి విధ్వంసానికి పాల్పడింది. 
 
ఈ ఘటనపై ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సంఘి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ దాడి ఘటన పోలీసులు వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని వ్యాఖ్యానించింది. 
 
కేజ్రీవాల్ నివాసం వద్ద సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి బాధ్యులెవరో తేల్చి 2 వారాల్లో తమకు నివేదిక సమర్పించాలంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించి తదుపరి విచారణను వచ్చే నెల 17వ తేదీకి వాయిదావేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments