Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరుబయట మలవిసర్జన చేశారని... చిన్నారులపై మూకదాడి!

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (07:30 IST)
మధ్యప్రదేశ్​లో గ్రామ పంచాయతీ భవనం ముందు మలవిసర్జన చేసినందుకు ఇద్దరు చిన్నారులపై స్థానికులు మూకదాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన బాధితులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మధ్యప్రదేశ్​లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ భవనం ముందు మలవిసర్జన చేశారనే నెపంతో ఇద్దరు ఎస్సీ బాలలపై మూకదాడికి దిగారు గ్రామస్థులు. శివ్​పుర్ జిల్లా​లో జరిగిన ఈ ఘటనలో ఆ ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

శివ్​పుర్​ జిల్లా భావ్​కేది గ్రామానికి చెందిన రోషనీ(12), అవినాశ్​ (10) అనే ఇద్దరు చిన్నారులు.. ఇవాళ ఉదయం స్థానిక గ్రామ పంచాయతీ భవనం ముందు మలవిసర్జన చేశారు. అది గమనించిన గ్రామస్థులు వారిపై కన్నెర్ర చేశారు.

చిన్నపిల్లలని కూడా చూడకుండా కర్కశంగా మూక దాడి చేశారు. ఆ చిన్నారులను తీవ్రస్థాయిలో గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని.. బాధితులను జిల్లా ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనకు ఒడిగట్టిన నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments