Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరుబయట మలవిసర్జన చేశారని... చిన్నారులపై మూకదాడి!

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (07:30 IST)
మధ్యప్రదేశ్​లో గ్రామ పంచాయతీ భవనం ముందు మలవిసర్జన చేసినందుకు ఇద్దరు చిన్నారులపై స్థానికులు మూకదాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన బాధితులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మధ్యప్రదేశ్​లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ భవనం ముందు మలవిసర్జన చేశారనే నెపంతో ఇద్దరు ఎస్సీ బాలలపై మూకదాడికి దిగారు గ్రామస్థులు. శివ్​పుర్ జిల్లా​లో జరిగిన ఈ ఘటనలో ఆ ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

శివ్​పుర్​ జిల్లా భావ్​కేది గ్రామానికి చెందిన రోషనీ(12), అవినాశ్​ (10) అనే ఇద్దరు చిన్నారులు.. ఇవాళ ఉదయం స్థానిక గ్రామ పంచాయతీ భవనం ముందు మలవిసర్జన చేశారు. అది గమనించిన గ్రామస్థులు వారిపై కన్నెర్ర చేశారు.

చిన్నపిల్లలని కూడా చూడకుండా కర్కశంగా మూక దాడి చేశారు. ఆ చిన్నారులను తీవ్రస్థాయిలో గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని.. బాధితులను జిల్లా ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనకు ఒడిగట్టిన నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments