Webdunia - Bharat's app for daily news and videos

Install App

పహల్గాం ఉగ్రదాడిలో పాక్ సైనికుడు... తేల్చిన నిఘా వర్గాలు

ఠాగూర్
మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (12:08 IST)
ఇటీవల కాశ్మీర్ లోయలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పాకిస్థాన్ సైన్యం హస్తమున్నట్టు నిరూపించే బలమైన ఆధారాన్ని భారత భద్రతా బలగాలు సంపాదించాయి. ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా, అధికారులు కాశ్మీరులు వందలాది మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఈ క్రమంలోనే పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్ ముసాకు పాక్ సైన్యంతో సంబంధం ఉందని తేలింది. 
 
హషిమ్ మూసా పాక్ పారా కామాండ్ అని, లష్కర్ తోయిబాతో కలిసి అతడు పని చేస్తున్నట్టు దర్యాప్తు బృందాలు తేల్చాయి. తమ అదపులో ఉన్న 15 మంది ఉగ్రవాద ఓవర్ గ్రౌండ్ వర్కర్లు ముూసాకు ఉన్న సైనిక నేపథ్యాన్ని కూడా ధృవీకరించారని అధికారులు వెల్లడించారు. ముసాతో పాటు ఈ దాడిలో పాల్గొన్న మరో ఇద్దరు ఉగ్రవాదులు జునైద్ భట్, అర్బాజ్ మిర్ కూడా పాక్‌లో శిక్షణ పొందినట్టు గుర్తించారు. 
 
పాకిస్థాన్ స్పెషల్ సర్వీస్ గ్రూపు నుంచి హషీమ్ మూసా లష్కరేలోకి సహాయకుడిగా వచ్చినట్టు తెలుస్తోందని భద్రతా అధికారి ఒకరు వెల్లడించారు. ఉగ్రవాదులకు, పాక్ సైన్యానికి మధ్య ఉన్న సంబంధానికి ఇదే నిదర్శనమని చెప్పారు. పారా కమాండోలకు పాకిస్థాన్ అత్యాధునిక శిక్షణ ఇస్తోందని, కోవర్ట్ ఆపరేషన్‌లలో తీర్చిదిద్దుతోందని ఆరోపించారు. అత్యాధునిక ఆయుధాల వినియోగంపై శిక్షణ అందిస్తోందని వారు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments