సోషల్ మీడియాలో తాజాగా పహెల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack)కి సంబంధించిన భయంకర వీడియో బైటకు వచ్చింది. అహ్మదాబాదుకి చెందిన ఓ పర్యాటకుడు జిప్ లైన్ రోప్ వేతో ఆకాశంలో హుషారుగా కేరింతలు కొడుతున్నవేళ అతడిని వీడియో తీసాడు మరో వ్యక్తి. అందులో అక్కడ గ్రౌండు పైన ఉగ్రవాదులు తుపాకులతో పర్యాటకుల పైన కాల్పులు జరుపుతున్నారు.
ఆ కాల్పులకు ఒక్కో పర్యాటకుడు నేలకొరుగుతున్నారు. కానీ రోప్ వే సాయంతో గ్రౌండు పైనుంచి 20 అడుగుల ఎత్తులో వున్న వ్యక్తికి మాత్రం అవేవీ తెలయలేదు. వెనుక రక్తపాతం జరుగుతున్న దారుణ దృశ్యాలు ఈ వీడియోలో రికార్డయ్యాయి. గన్ షాట్స్ శబ్దం వినబడుతున్న సమయంలో జిప్ లైన్ ఆపరేటర్ అల్లా హు అక్బర్ అంటూ మూడుసార్లు అనడం కూడా వినబడుతోంది.