Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి శుభకార్యానికి బంధువులను పిలవలేదని కన్నబిడ్డను కాల్చేసిన తండ్రి...

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (08:49 IST)
ఇంట్లో జరిగే శుభకార్యానికి బంధువులందరినీ పిలవలేదన్న కారణంతో కన్నబిడ్డను ఓ కసాయి తండ్రి తుపాకీతో కాల్చిపారేశాడు. హర్యానా రాష్ట్రంలోని భివానీలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
భివానీ జిల్లాలోని సుధీవాస్ గ్రామానికి చెందిన తారాచంద్ అనే వ్యక్తి ఇంట్లో ఓ శుభకార్యాన్ని నిర్వహించేందుకు తలపెట్టారు. ఇందుకోసం చుట్టుపక్కలవారితో పాటు బంధువులను కూడా ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే, బంధువులను పిలిచే  బాధ్యతలను తన కుమారుడు ధర్మేంద్రకు అప్పగించాడు. 
 
అతను కొంతమంది బంధువులను పిలిచి.. ఇంకొందరిని పిలవలేదు. ఈ విషయం తారాచంద్‌కు తెలిసి ఆగ్రహించి, వారిని కూడా పిలవాలని చెప్పాడు. కానీ, ధర్మేంద్ర వారిని పిలిచేందుకు ససేమిరా అన్నారు. వెంటనే ఆగ్రహోద్రుక్తుడైన తారాచంద్ తన తుపాకీ తీసి కుమారునిపై కాల్పులు జరిపాడు. 
 
ఫలితంగా అతను కుప్పకూలిపోవడంతో, వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరిశీలించి, అప్పటికే మృతి చెందాడని తేల్చిచెప్పారు. దీంతో బంధువులు ధర్మేంద్ర మృతదేహాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. తారాచంద్‌తో పాటు.. మొత్తం 12 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిద్రమాత్రలు మింగిన గాయని కల్పన ఆరోగ్యం ఎలావుంది? (Video)

ప్లీజ్ అలా పిలవొద్దంటున్న అగ్ర హీరోయిన్!!

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments