Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానాలో అంతుచిక్కని జ్వరం - 24 మంది చిన్నారుల మృతి

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (15:24 IST)
హర్యానా రాష్ట్రంలో అంతుచిక్కని జ్వరాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ జ్వరాలకు చిన్నారులు అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలోని పాల్వల్ జిల్లాలో అంతు చిక్కని జ్వరంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
 
ఈ అంతుచిక్కని జ్వరంతో హథిన్​ ప్రాంతంలో గడిచిన పది రోజుల్లో 24 మంది చిన్నారులు మరణించారు. చిల్లీ గ్రామంలో 11 మంది సహా మరో రెండు చోట్ల 13 మంది మృతిచెందారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ జ్వరం బారిన పడినవారి సంఖ్యతో పాటు మృతులు పెరగడం వల్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
 
జ్వరం బారినపడిన రెండు రోజులకే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తన చిన్నారి మరణించినట్లు బాధిత తల్లిదండ్రులు తెలిపారు. ప్లేట్​లెట్స్​ కౌంట్​ భారీగా తగ్గిపోయి.. తొమ్మిది నెలల పసికందు చనిపోయింది. అయితే ఆ శిశువు డెంగ్యూతో చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. ఇంత మంది పిల్లలు మరణించినప్పటికీ వైద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments