Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్‌టీ 5 నుంచి 6 శాతానికి పెంపు

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (08:54 IST)
లోటు ఆదాయంతో సతమతం అవుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఖజానా నింపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) రేట్లను పునర్‌ వ్యవస్థీకరించే యోచనలో ఉంది.

ప్రస్తుతం జీఎ్‌సటీలో నాలుగు (5,12,18,28 శాతం) పన్ను శ్లాబులున్నాయి. అందులో 5 శాతం శ్లాబు రేటు ను 6 శాతానికి పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా ప్రభుత్వానికి జీఎ్‌సటీ ఆదాయం నెలకు రూ.1,000 కోట్ల మేర పెరగవచ్చని అంచనా.

ఈ నెల 18న సమావేశం కానున్న జీఎ్‌సటీ మండలి ఈ విషయమై చర్చించే అవకాశం ఉంది. అయితే, ఈ శ్లాబ్‌ రేటును పెంచితే నిత్యావసరాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే, ఆహారోత్పత్తులు, పాదరక్షలు, సామాన్యులు ఉపయోగించే వస్త్రాలన్నీ ఈ శ్లాబ్‌ పరిధిలోకే వస్తాయి.
 
మొత్తం వసూళ్లలో 5 శాతం వాటా
ప్రభుత్వానికొచ్చే మొత్తం జీఎ్‌సటీ ఆదాయంలో 5 శాతం శ్లాబ్‌ ద్వారా సమకూరే వాటా 5 శాతమే. నెలవారీ జీఎ్‌సటీ వసూళ్లను రూ.1.20 లక్షల కోట్ల స్థాయికి పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

కానీ, సెప్టెంబరులో జీఎ్‌సటీ ఆదాయం 19 నెలల కనిష్ఠ స్థాయి రూ.91,916 కోట్లకు పడిపోయింది. ఆ తర్వాత కాస్త పుంజుకుంది. అక్టోబరులో రూ.95,380 కోట్లకు, నవంబరులో రూ.1.03 లక్షల కోట్లకు పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments