జీఎస్‌టీ 5 నుంచి 6 శాతానికి పెంపు

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (08:54 IST)
లోటు ఆదాయంతో సతమతం అవుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఖజానా నింపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) రేట్లను పునర్‌ వ్యవస్థీకరించే యోచనలో ఉంది.

ప్రస్తుతం జీఎ్‌సటీలో నాలుగు (5,12,18,28 శాతం) పన్ను శ్లాబులున్నాయి. అందులో 5 శాతం శ్లాబు రేటు ను 6 శాతానికి పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా ప్రభుత్వానికి జీఎ్‌సటీ ఆదాయం నెలకు రూ.1,000 కోట్ల మేర పెరగవచ్చని అంచనా.

ఈ నెల 18న సమావేశం కానున్న జీఎ్‌సటీ మండలి ఈ విషయమై చర్చించే అవకాశం ఉంది. అయితే, ఈ శ్లాబ్‌ రేటును పెంచితే నిత్యావసరాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే, ఆహారోత్పత్తులు, పాదరక్షలు, సామాన్యులు ఉపయోగించే వస్త్రాలన్నీ ఈ శ్లాబ్‌ పరిధిలోకే వస్తాయి.
 
మొత్తం వసూళ్లలో 5 శాతం వాటా
ప్రభుత్వానికొచ్చే మొత్తం జీఎ్‌సటీ ఆదాయంలో 5 శాతం శ్లాబ్‌ ద్వారా సమకూరే వాటా 5 శాతమే. నెలవారీ జీఎ్‌సటీ వసూళ్లను రూ.1.20 లక్షల కోట్ల స్థాయికి పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

కానీ, సెప్టెంబరులో జీఎ్‌సటీ ఆదాయం 19 నెలల కనిష్ఠ స్థాయి రూ.91,916 కోట్లకు పడిపోయింది. ఆ తర్వాత కాస్త పుంజుకుంది. అక్టోబరులో రూ.95,380 కోట్లకు, నవంబరులో రూ.1.03 లక్షల కోట్లకు పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments