Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక, చూడండి తొందరలోనే పెట్రోల్ లోన్ తీసుకోవాల్సి వస్తుంది..?

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (20:29 IST)
పెట్రో ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధర ఆల్ టైం హై రికార్డులను సృష్టించాయి. ఈ నేపథ్యంలో పెట్రో ధరలపై సెటైర్లు వేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్.
 
బుధవారం పార్లమెంట్‌లో శశిథరూర్ మాట్లాడుతూ.. ఇతర అంశాలతో పాటు.. బడ్జెట్‌ కేటాయింపులు, నిత్యావసరాల ధరలు, పెట్రో ధరలను ప్రస్తావించారు. రక్షణ, ఆరోగ్య రంగాలలో మోసపూరిత లెక్కలతో ప్రజలను మభ్యపెట్టి మోసగించే ప్రతిపాదనలు చేశారని కామెంట్ చేసిన శశిథరూర్.. లాల్ బహదూర్ శాస్త్రి 'జై జవాన్.. జై కిసాన్' అని నినదిస్తే.. తాజా బడ్జెట్ దానికి పూర్తి వ్యతిరేకంగా నా జవాన్.. నా కిసాన్ అని స్పష్టం చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇక, ఈ బడ్జెట్ మధ్య తరగతి వారిని పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. వారికి ఏం ఇచ్చారని అడిగితే పెట్రోల్ ధరలో పెరుగుదల ఇచ్చారని ఎద్దేవా చేశారు.. 2014 నుంచి పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం 894 శాతం పెంచేశారని తెలిపిన శశిథరూర్.. ఇక, చూడండి తొందరలోనే పెట్రోల్ కోసం బ్యాంకులో లోన్ తీసుకోవాల్సి వస్తుంది అంటూ సెటైర్లు వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments