Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈదురు గాలులకు కదిలిన ఇంజిన్ లేని గూడ్సు రైలు.. ఆరుగురి మృతి

Webdunia
గురువారం, 8 జూన్ 2023 (09:19 IST)
ఒడిశా రాష్ట్రంలో మరో విషాదం ఘటన జరిగింది. వానొస్తుందని ఇంజన్ లేని గూడ్సు రైలు కిందకు వెళ్లిన కూలీల్లో కొందరు మృత్యువాతపడ్డారు. ఈదురు గాలుల ధాటికి పట్టాలపై ఆగివున్న గూడ్సు రైలు ముందుకు కదిలింది. దీంతో ఆ రైలు కింద కూర్చొనివున్న కార్మికుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన ఒడిశా రాష్ట్రంలోని ఝాజ్పూర్ రోడ్డు రైల్వే స్టేషన్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఝాజ్పూర్ రోడ్డు రైల్వేస్టేషన్‌లో సేఫ్టీ ట్రాక్‌పై కొద్దిరోజులుగా ఇంజన్ లేని ఖాళీ గూడ్స్ వ్యాగన్లు నిలిపి ఉంచారు. రైల్వే పనుల కోసం బుధవారం 8 మంది కార్మికులు అక్కడికి వచ్చారు. అయితే, వర్షంతో పాటు బలమైన గాలులు రావడంతో వారంతా నిలిపి ఉంచిన గూడ్స్ వ్యాగన్ల కింద తలదాచుకున్నారు. 
 
ఆ సమయంలో ఈదురు గాలులు మరింత బలంగా వీయడంతో గూడ్స్ వ్యాగన్లు ముందుకు కదిలాయి. వాటి చక్రాల కింద ఆరుగురు ప్రాణాలు విడిచారు. దీంతో కార్మికుల నివాసాల్లో విషాదం నెలకొంది. స్థానిక రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments