Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈదురు గాలులకు కదిలిన ఇంజిన్ లేని గూడ్సు రైలు.. ఆరుగురి మృతి

Webdunia
గురువారం, 8 జూన్ 2023 (09:19 IST)
ఒడిశా రాష్ట్రంలో మరో విషాదం ఘటన జరిగింది. వానొస్తుందని ఇంజన్ లేని గూడ్సు రైలు కిందకు వెళ్లిన కూలీల్లో కొందరు మృత్యువాతపడ్డారు. ఈదురు గాలుల ధాటికి పట్టాలపై ఆగివున్న గూడ్సు రైలు ముందుకు కదిలింది. దీంతో ఆ రైలు కింద కూర్చొనివున్న కార్మికుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన ఒడిశా రాష్ట్రంలోని ఝాజ్పూర్ రోడ్డు రైల్వే స్టేషన్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఝాజ్పూర్ రోడ్డు రైల్వేస్టేషన్‌లో సేఫ్టీ ట్రాక్‌పై కొద్దిరోజులుగా ఇంజన్ లేని ఖాళీ గూడ్స్ వ్యాగన్లు నిలిపి ఉంచారు. రైల్వే పనుల కోసం బుధవారం 8 మంది కార్మికులు అక్కడికి వచ్చారు. అయితే, వర్షంతో పాటు బలమైన గాలులు రావడంతో వారంతా నిలిపి ఉంచిన గూడ్స్ వ్యాగన్ల కింద తలదాచుకున్నారు. 
 
ఆ సమయంలో ఈదురు గాలులు మరింత బలంగా వీయడంతో గూడ్స్ వ్యాగన్లు ముందుకు కదిలాయి. వాటి చక్రాల కింద ఆరుగురు ప్రాణాలు విడిచారు. దీంతో కార్మికుల నివాసాల్లో విషాదం నెలకొంది. స్థానిక రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగచైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్‌ రివ్యూ

Thandel: తండేల్ ట్విట్టర్ రివ్యూ.. నాగ చైతన్య, సాయి పల్లవి నటనకు మంచి మార్కులు

Pushpa 2: పుష్ప ఫ్యాన్.. మహా కుంభమేళాలో డైలాగులతో ఇరగదీశాడు.. వీడియో వైరల్

తండేల్‌కు బెనిఫిట్ షోలు లేవు.. అంత బెనిఫిట్ మాకొద్దు : అల్లు అరవింద్

Latha Mangeshkar: లతా మంగేష్కర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఐదేళ్లలోనే ఆమె ప్రతిభ అలా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments