Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డెన్ బాబాకు భారీ భద్రత.. 20కిలోల బంగారంతో యాత్ర.. ఎక్కడ?

అమాయక ప్రజల వద్ద దోచుకుంటున్న బాబాలు కోటీశ్వరులుగా మారిపోతున్నారు. ఈ క్రమంలో ముందు వరుసలో ఉండే బాబాల్లో సుధీర్‌ మక్కర్‌ ఒకరు. ఇతను గోల్డెన్ బాబాగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. బాబాగా మారకముందు గోల్డె

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (15:18 IST)
అమాయక ప్రజల వద్ద దోచుకుంటున్న బాబాలు కోటీశ్వరులుగా మారిపోతున్నారు. ఈ క్రమంలో ముందు వరుసలో ఉండే బాబాల్లో సుధీర్‌ మక్కర్‌ ఒకరు. ఇతను గోల్డెన్ బాబాగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. బాబాగా మారకముందు గోల్డెన్ బాబా ఢిల్లీలో వస్త్ర వ్యాపారం చేసేవారు. పలు క్రిమినల్‌ కేసుల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒంటినిండా బంగారం వేసుకుని ప్రతీ ఏడాది ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు కన్వార్‌ పేరిట యాత్ర నిర్వహిస్తారు. 
 
ఇదే తరహాలో ఈ సంవత్సరం ఒంటిమీద 20 కిలోల బంగారంతో యాత్ర చేపట్టారు. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం దీని విలువ రూ. 6 కోట్లకు వరకు ఉంటుందని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఈయన 14.5 కిలోల బంగారం వేసుకోగా, 2016లో 12 కేజీల కాంచనాన్ని ఒంటిపై ధరించారు. ఈ బాబా నిర్వహించే యాత్ర కోసం పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.  
 
దీనిపై గోల్డెన్ బాబా మాట్లాడుతూ.. ఇరవై ఐదేండ్లుగా తాను ఈ యాత్రను చేపడుతున్నానని అన్నారు. బంగారం ధర తులానికి రూ. 200 ఉన్నప్పట్నుంచి తాను యాత్ర చేస్తున్నానని చెప్పారు. వయోభారంతో ఒంటిపై అధిక బంగారం మోయలేకపోతున్నానని బాబా చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments