Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రక్కన మట్టిదిబ్బలో బంగారు నాణేలు, ఎగబడిన జనం.. ఎక్కడ?

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (20:36 IST)
తమిళనాడు ప్రాంతం హోసూరులోని రోడ్డు ప్రక్కన ఉన్న మట్టి దిబ్బలో బంగారు నాణేలు బయటపడ్డాయి. హోసూరు బాగలూరు వెంట ఉన్న ఆ మట్టి దిబ్బలో బంగారు నాణేలు ఉన్నాయన్న సమాచారంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. స్థానికులతో పాటు రోడ్లపై వెళ్లే వాహనదార్లు, ఇరుగుపొరుగు ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడారు.
 
దాంతో ఆమార్గంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో కిలో మీటర్ల మేరకు అక్కడక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కాగా ఒక్కో నాణేం బరువు దాదాపు 2 గ్రాములు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పురాతన నాణేలుగా భావిస్తున్న వీటిపై అరబిక్ లిపిలో అక్షరాలు దర్శనమిచ్చాయి.
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న హోసూరు పోలీసులు హుటాహుటిన అక్కకడికి చేరుకున్నారు. ఇక్కడ మట్టి దిబ్బల్లోకి బంగారు నాణేలు ఎలా వచ్చాయనే దానిపై ఆరా తీస్తున్నారు. కాగా పోలీసులు వచ్చేలోపే బంగారు నాణేలు దొరకబుచ్చుకున్నవారు అక్కడి నుంచి జారుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments