రోడ్డు ప్రక్కన మట్టిదిబ్బలో బంగారు నాణేలు, ఎగబడిన జనం.. ఎక్కడ?

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (20:36 IST)
తమిళనాడు ప్రాంతం హోసూరులోని రోడ్డు ప్రక్కన ఉన్న మట్టి దిబ్బలో బంగారు నాణేలు బయటపడ్డాయి. హోసూరు బాగలూరు వెంట ఉన్న ఆ మట్టి దిబ్బలో బంగారు నాణేలు ఉన్నాయన్న సమాచారంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. స్థానికులతో పాటు రోడ్లపై వెళ్లే వాహనదార్లు, ఇరుగుపొరుగు ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడారు.
 
దాంతో ఆమార్గంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో కిలో మీటర్ల మేరకు అక్కడక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కాగా ఒక్కో నాణేం బరువు దాదాపు 2 గ్రాములు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పురాతన నాణేలుగా భావిస్తున్న వీటిపై అరబిక్ లిపిలో అక్షరాలు దర్శనమిచ్చాయి.
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న హోసూరు పోలీసులు హుటాహుటిన అక్కకడికి చేరుకున్నారు. ఇక్కడ మట్టి దిబ్బల్లోకి బంగారు నాణేలు ఎలా వచ్చాయనే దానిపై ఆరా తీస్తున్నారు. కాగా పోలీసులు వచ్చేలోపే బంగారు నాణేలు దొరకబుచ్చుకున్నవారు అక్కడి నుంచి జారుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments