Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా బీచ్‌లో విచ్చలవిడిగా వ్యభిచారం... ఆంధ్రా అమ్మాయిలను తీసుకెళ్లి...

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (11:27 IST)
ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్న గోవాలోని సముద్రతీరంలో విచ్చలవిడిగా వ్యభిచారం సాగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 
 
పనాజీ నగరంలోని కలాన్‌గుటీ బీచ్ కేంద్రంగా గుట్టుచప్పుడుకాకుండా వ్యభిచారం సాగుతోంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారని క్రైంబ్రాంచ్ పోలీసులకు రహస్య సమచారం వచ్చింది. దీంతో పోలీసులు మారువేషంలో విటుడిలా ఓ పోలీసును పంపించగా వ్యభిచారం రాకెట్ బాగోతం వెలుగుచూసింది. 
 
ఆండ్రియా పెరీరా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి క్రైంబ్రాంచ్ పోలీసులు వ్యభిచార రాకెట్ బాగోతాన్ని బయటపెట్టారు. మహారాష్ట్ర, ఆంధ్రాల నుంచి అమ్మాయిలను గోవాకు తీసుకువచ్చి వారితో వ్యభిచారం సాగించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. 
 
ఈ వ్యభిచార రాకెట్ కీలక సూత్రధారులైన అక్షయ్(27), థోఫిక్ (27) లను క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచారిణులను గోవాలోని రాష్ట్ర మహిళల సదనానికి తరలించారు. ఈ వ్యభిచార రాకెట్‌పై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments