Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోమలు కుట్టాయనీ భర్తను రోకలిబండతో చితకబాదిన భార్య

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (11:12 IST)
రాత్రి పూట ఇంట్లో పడుకునివుండగా దోమలు కుట్టాయని భర్తను రోకలిబండతో చితకబాదిందో భార్య. ఈ దాడిలో భర్త తీవ్రంగా గాయపడ్డారు. పైగా, ఈ చర్యను ఆమె ఇద్దరు కుమార్తెలు సమర్థించారు కూడా. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ నగరంలోని నరోడా ప్రాంతంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నరోడా ప్రాంతానికి చెందిన భూపేంద్ర లెవువా గత కొన్ని మాసాలుగా కారులో ఎల్ఈడీలు బల్బులు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 
 
బల్బులు విక్రయించడం వల్ల వచ్చే ఆదాయంతోనే కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. అయితే, ఈ ఆదాయం సరిపోక పోవడంతో ఇంటి కరెంటు బిల్లుకూడా చెల్లించలేక పోయాడు. దీంతో విద్యుత్ సిబ్బంది ఇంటికి కరెంట్ కట్ చేశారు. 
 
ఈ కారణంగా చీకటి ఇంట్లోనే గడపాల్సి వచ్చింది. దీంతో ఇంట్లో దోమలు ఎక్కువై భార్యాపిల్లలు నిద్రపోవడం మానేశారు. పైగా, దోమలు కుడుతుండటంతో భరించలేకపోయారు. ఈ క్రమంలో రాత్రిపూట నిద్రిస్తున్న భర్తపై భార్య రోకలిబండతో మోది గాయపరిచింది. 
 
ఆ దెబ్బలకు అతని కుడి కంటికి కూడా గాయమైంది. దీనిపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు... విచారిస్తున్నారు. బాధితుడుని ఆస్పత్రికి తరలించగా, కంటి గాయానికి ఏడు కుట్లు వేసి చికిత్స చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments