నా 20 కోట్లు నాకివ్వండి: సుప్రీంలో కార్తీ చిదంబరం పిటిషన్

Webdunia
మంగళవారం, 14 జనవరి 2020 (07:30 IST)
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం గతంలో తాను సుప్రీం కోర్టులో డిపాజిట్ చేసిన రూ.20 కోట్లను తిరిగి ఇవ్వాలంటూ సోమవారం పిటిషన్ వేశారు.

తన విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి ఇచ్చేందుకు షరతుల్లో భాగంగా కట్టిన ఆ సొమ్మును రిటర్న్ చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం.. దీనిపై స్పందన చెప్పాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి  నోటీసు పంపింది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
 
యూపీఏ హయాంలో చిదంబరం కేంద్రమంత్రిగా ఉండగా ఆయన సాయంతో కార్తీ అక్రమంగా విదేశాల నుంచి ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థకు రూ.305 కోట్ల నిధులు రప్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కార్తీపై అభియోగాలు నమోదు చేసి.. సీబీఐ, ఈడీ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.

ఈ కేసులో అరెస్టయిన ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ దేశం దాటి వెళ్లకూడదని షరతు విధించింది. దీంతో గత ఏడాది జనవరి, మే నెలల్లో విదేశీ పర్యటనలకు వెళ్లాలంటూ ఆయన సుప్రీం పర్మిషన్ కోరారు. దీనికి అనుమతిస్తూ కొన్ని షరతలు పెట్టింది న్యాయస్థానం.

ఇందులో భాగంగా రూ.10 కోట్ల చొప్పున రెండు పర్యటనలకు రూ.20 కోట్లు సుప్రీం సెక్రెటరీ జనరల్ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఆ మొత్తాన్ని కట్టి విదేశీ పర్యటనలకు వెళ్లి వచ్చిన ఆయన దాన్ని రిటర్న్ చేయాలని కోర్టును కోరుతున్నారు.

రూ.10 కోట్లు లోన్‌గా తీసుకుని కట్టానని, దాని వడ్డీ కడుతున్నానని, ఆ సొమ్ము తిరిగి ఇచ్చేయాలని గత ఏడాదిలో పిటిషన్ వేయగా.. దాన్ని సుప్రీం కోర్టు కొట్టేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments