Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచార బాధితులకు ఎక్కడైనా వైద్యం చేయాలి : ఢిల్లీ హైకోర్టు

ఠాగూర్
మంగళవారం, 24 డిశెంబరు 2024 (17:28 IST)
యాసిడ్ దాడి, అత్యాచారం, లైంగిక వేధింపులకు గురయ్యే బాధితులకు దేశంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లలో చికిత్స చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఉచిత వైద్యంలో భాగంగా మెడికల్ పరీక్షలు కూడా డబ్బులు తీసుకోకుండా చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
లైంగిక దాడుల బాధితులకు చికిత్స నిరాకరించడం చట్ట రీత్యా నేరమని, సంబంధిత హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, మేనేజ్మెంట్ జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. 16 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి అత్యాచారం చేసిన కేసులో ఢిల్లీ హైకోర్టు జడ్జిలు ప్రతిభా ఎం సింగ్, అమిత్ శర్మలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 
 
లైంగిక దాడుల నుంచి బయటపడిన బాధితులు ఉచిత వైద్య చికిత్స విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. ఉచిత చికిత్సలో భాగంగా అవసరమైన అన్ని పరీక్షలు, రోగ నిర్ధారణ టెస్టులు చేయడంతో పాటు దీర్ఘకాలిక వైద్య సంరక్షణ కూడా అందించాలని స్పష్టం చేసింది. బాధితులకు అవసరమైన కౌన్సెలింగ్ కూడా ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం