Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా విధ్వంసానికి పరిష్కారం లభించడం లేదు : సీఎం చంద్రబాబు

ఠాగూర్
మంగళవారం, 24 డిశెంబరు 2024 (17:18 IST)
గత ఆరు నెలలుగా అహోరాత్రులు శ్రమిస్తున్నప్పటికీ వైకాపా పాలకుల విధ్వంసానికి ఎక్కడా పరిష్కారమార్గం లభించడం లేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం రాత్రి విజయవాడ నగరంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రాష్ట్రాన్ని బాగు చేయాలన్నదే తన లక్ష్యమని, ఈ విషయంలో మాత్రం ఎలాంటి రాజీపడబోమని చెప్పారు. 
 
గత ఆరు నెలలుగా అహోరాత్రులు పరిశోధన చేస్తున్నా గత ఐదేళ్లుగా జరిగిన విధ్వంసానికి పరిష్కారం దొరకడం లేదని చంద్రబాబు అన్నారు. క్రైస్తవులకు పూర్తి అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు. గుంటూరులో క్రైస్తవ భవనాన్ని తామే పూర్తి చేస్తామని వాగ్దానం చేశారు. గత ఐదేళ్లలో పాలకులు భవన నిర్మాణం చేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. జెరూసలేం వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సాయం చేయడం ప్రారంభించింది. 
 
గత పాలకులు ఐదేళ్లలో క్రైస్తవ అనుబంధ విద్యాసంస్థలను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. మైనార్టీ వర్గాల సంక్షేమానికి, భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులతో కలిసి సీఎం చంద్రబాబు క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments