Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 50వేలకు బాలికను అమ్మేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ?

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (15:34 IST)
మంచి హోదాలో ఉన్న యువకుడితో పెండ్లి చేయిస్తామని నమ్మబలికి బాలికను రూ. 50,000లకు ఓ దంపతులు విక్రయించిన దారుణ ఘటన యూపీలోని బదౌన్‌ జిల్లాలో వెలుగుచూసింది. పెళ్లి పేరుతో షహజన్‌పూర్‌ జిల్లా నుంచి తీసుకొచ్చిన నిందితులు బదౌన్‌లోని ఓ వ్యక్తికి అమ్మారు. 
 
ఈ విషయం పోలీసులకు తెలియడంతో బాలికను కొనుగోలు చేసిన వ్యక్తి సహా దంపతులను అరెస్ట్‌ చేశారు. జిల్లాలోని గదియ హర్దోపట్టి గ్రామానికి చెందిన రాజ్‌వీర్‌ బాలికను రూ 50,000కు కొనుగోలు చేసినట్టు సమాచారం.
 
మంజు దేవి, కృష్ణపాల్‌ దంపతులు బాలికకు పెండ్లి చేసి మంచి కుటుంబంలోకి పంపిస్తామని మహిళను నమ్మబలికి ఆమె కుమార్తెను బదౌన్‌ జిల్లాకు తీసుకువచ్చి రాజ్‌వీర్‌కు అమ్మారని పోలీసులు తెలిపారు. మంజు బాధితురాలి గ్రామానికి చెందిన వ్యక్తే కావడం గమనార్హం. 
 
రాజ్‌వీర్‌ తీరు నచ్చని బాధితురాలు నిందితులు తనను ఆయనకు విక్రయించారని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం బాలికను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

Madhumita : శివ బాలాజీ, మధుమిత నటించిన జానపద గీతం గోదారికే సోగ్గాన్నే విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments