Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకా వేసుకుంటే.. ఆస్తి పన్నులో బంపర్ ఆఫర్

Webdunia
ఆదివారం, 11 ఏప్రియల్ 2021 (08:45 IST)
కరోనా వైరస్ వేయించుకుంటే ఆస్తి పన్ను చెల్లింపులు రిబేట్ ఇస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులో విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణం కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శరవేగంగా సాగడమే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం టీకాలు వేస్తోంది. 
 
చాలా మంది జనం టీకా వేసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకు ఉత్తర ఢిల్లీ మేయర్‌ జై ప్రకాశ్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. కొవిడ్‌ టీకా వేసుకుంటే ఆస్తిపన్నులో రీబేటు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
 
రాయితీ కోసం రెసిడెన్షియల్‌ హౌస్‌ యజమాని, అర్హత గల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు కార్పొరేషన్‌ ఆమోదం కోసం సర్క్యులర్‌ జారీ చేసినట్లు తెలిపారు. 
 
ఈ మేరకు నివాస గృహాల యజమానులు, పన్ను చెల్లింపుదారులకు ఆస్తిపన్నులో అదనంగా 5శాతం రిబేటు ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ కాపీలు అందజేయాలని తెలిపారు. సర్క్యులర్‌ తక్షణం అమలులోకి వస్తుందని, జూన్‌ 30వ తేదీ వరకు మాత్రమే అవకాశం అందుబాటులో ఉంటుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments