Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకా వేసుకుంటే.. ఆస్తి పన్నులో బంపర్ ఆఫర్

Webdunia
ఆదివారం, 11 ఏప్రియల్ 2021 (08:45 IST)
కరోనా వైరస్ వేయించుకుంటే ఆస్తి పన్ను చెల్లింపులు రిబేట్ ఇస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులో విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణం కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శరవేగంగా సాగడమే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం టీకాలు వేస్తోంది. 
 
చాలా మంది జనం టీకా వేసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకు ఉత్తర ఢిల్లీ మేయర్‌ జై ప్రకాశ్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. కొవిడ్‌ టీకా వేసుకుంటే ఆస్తిపన్నులో రీబేటు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
 
రాయితీ కోసం రెసిడెన్షియల్‌ హౌస్‌ యజమాని, అర్హత గల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు కార్పొరేషన్‌ ఆమోదం కోసం సర్క్యులర్‌ జారీ చేసినట్లు తెలిపారు. 
 
ఈ మేరకు నివాస గృహాల యజమానులు, పన్ను చెల్లింపుదారులకు ఆస్తిపన్నులో అదనంగా 5శాతం రిబేటు ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ కాపీలు అందజేయాలని తెలిపారు. సర్క్యులర్‌ తక్షణం అమలులోకి వస్తుందని, జూన్‌ 30వ తేదీ వరకు మాత్రమే అవకాశం అందుబాటులో ఉంటుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments