స్వతంత్ర భారతావనిలో తొలి తీవ్రవాది హిందువే : కమల్ హాసన్

Webdunia
మంగళవారం, 14 మే 2019 (12:34 IST)
సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారతదేశంలో తొలి తీవ్రవాది హిందువేనని వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరామ్‌ గాడ్సేను తొలి తీవ్రవాదిగా ఆయన అభివర్ణించారు. 
 
తమిళనాడు రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఈనెల 18వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందులోభాగంగా ఆయన కరూరు జిల్లా అరవకురిచ్చిలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో మొదటి తీవ్రవాది ఓ హిందువని, అతడే మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరామ్‌గాడ్సే అని వ్యాఖ్యానించారు. 
 
ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతం కాబట్టి తాను ఈ మాట చెప్పడం లేదన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిలబడ్డాను కాబట్టే ఈ విషయం గురించి మాట్లాడుతున్నట్టు చెప్పుకొచ్చారు. 
 
స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి తీవ్రవాది ఓ హిందువు. అతడే నాథూరామ్ గాడ్సే. అక్కడి నుంచే తీవ్రవాదం మొదలైంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గాంధీజీకి మనుమడి వంటివాడినని, ఆయన హత్యపై నెలకొన్న ప్రశ్నలకు సమాధానాలు కోరేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. నిజమైన భారతీయులు త్రివర్ణ పతాకంలోని రంగులను, వాటి వెనుక ఉన్న విశ్వాసాలను చెక్కుచెదురకుండా కాపాడుకుంటారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments