Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయ ఉత్సవాల్లో అపశృతి - కూలిన క్రేన్.. నలుగురి మృతి

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (12:48 IST)
తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట జిల్లాలో ఆదివారం రాత్రి ఓ విషాదకర ఘటన జరిగింది. ఈ జిల్లాలోని ద్రౌపది అమ్మన్ ఆలయ వేడుకల్లో జరిగిన ఈ అపశృతిలో నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆలయ విగ్రహాలకు భారీ పూలమాలలను వేస్తుండగా, ఒక్కసారిగా క్రేన్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు చనిపోయారు. మరో కొందరు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి క్రేన్ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
రాణిపేట జిల్లాలోని ద్రౌపది అమ్మన్ ఆలయంలో ప్రతి యేటా వార్షిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇందులోభాగంగా, ఆదివారం రాత్రి ఆలయ ఉత్సవ మూర్తుల ఊరేగింపు జరిగింది. ఈ విగ్రహాలకు భారీ క్రేన్‌పై ఉంచి పూజారులు, ఆలయ సిబ్బందితో పాటు మొత్తం ఎనిమిది మంది క్రేన్‌పైకెక్కారు. వీరు ఉత్సవ మూర్తులకు పూలమాలలు వేస్తుండగా, ఒక్కసారిగా క్రేన్ కూలిపోయింది. 
 
క్రేన్ బాగా ఎత్తుకు తీసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని రాణిపేట జిల్లా ఎస్పీ దీపా సత్యన్ వెల్లడించారు. నిజానికి ఆలయ వేడుకల్లో క్రేన్‌ను ఉపయోగించేందుకు ముందస్తు అనుమతి తీసుకోలేదని అందుకే క్రేన్ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై ప్రాథమిక విచారణ జరుపుతున్నట్టు ఎస్పీ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments