Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయ ఉత్సవాల్లో అపశృతి - కూలిన క్రేన్.. నలుగురి మృతి

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (12:48 IST)
తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట జిల్లాలో ఆదివారం రాత్రి ఓ విషాదకర ఘటన జరిగింది. ఈ జిల్లాలోని ద్రౌపది అమ్మన్ ఆలయ వేడుకల్లో జరిగిన ఈ అపశృతిలో నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆలయ విగ్రహాలకు భారీ పూలమాలలను వేస్తుండగా, ఒక్కసారిగా క్రేన్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు చనిపోయారు. మరో కొందరు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి క్రేన్ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
రాణిపేట జిల్లాలోని ద్రౌపది అమ్మన్ ఆలయంలో ప్రతి యేటా వార్షిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇందులోభాగంగా, ఆదివారం రాత్రి ఆలయ ఉత్సవ మూర్తుల ఊరేగింపు జరిగింది. ఈ విగ్రహాలకు భారీ క్రేన్‌పై ఉంచి పూజారులు, ఆలయ సిబ్బందితో పాటు మొత్తం ఎనిమిది మంది క్రేన్‌పైకెక్కారు. వీరు ఉత్సవ మూర్తులకు పూలమాలలు వేస్తుండగా, ఒక్కసారిగా క్రేన్ కూలిపోయింది. 
 
క్రేన్ బాగా ఎత్తుకు తీసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని రాణిపేట జిల్లా ఎస్పీ దీపా సత్యన్ వెల్లడించారు. నిజానికి ఆలయ వేడుకల్లో క్రేన్‌ను ఉపయోగించేందుకు ముందస్తు అనుమతి తీసుకోలేదని అందుకే క్రేన్ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై ప్రాథమిక విచారణ జరుపుతున్నట్టు ఎస్పీ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments