Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫరూక్ అబ్దుల్లాపై ప్రజా భద్రతా చట్టం.. జైలుగా మారిన నివాసం

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (11:52 IST)
జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై కేంద్ర ప్రభుత్వం ప్రజా భద్రతా చట్టం (పి.ఎస్.ఏ)ను ప్రయోగించింది. దీంతో ఇప్పటివరకు గృహనిర్బంధంలో ఉన్న ఆయన ఇకపై జైలుపక్షిగా మారిపోయారు. పైగా, ఆయన నివాసం కూడా ఇపుడు జైలుగా మారిపోయింది. 
 
ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఫరూక్ అబ్దుల్లాను అత్యంత కఠినమైన ప్రజా భద్రతా చట్టం కింద అరెస్టు చేసినట్టు ప్రకటించింది. అలాగే, శ్రీనగర్‌లోని గుప్కార్‌ రోడ్డులో ఉన్న ఆయన నివాసాన్నే జైలుగా మారుస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 
 
ఆదివారం రాత్రి ఒంటిగంటకు ఈ పీఎస్ఏ నిర్బంధ ఉత్తర్వును ఆయనకు అధికారులు అందించారు. కాగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అధికరణ 370 రద్దు చేసిన ఆగస్టు 5వ తేదీ నుంచి ఫరూక్ అబ్దుల్లాను శ్రీనగర్‌లోని గృహ నిర్బధంలో ఉంచిన విషయం తెల్సిందే. గతంలో కాశ్మీరీ నేత షా ఫైజల్‌ను సైతం పీఎస్‌ఏ కింద నిర్భందంలోకి తీసుకున్నారు. 
 
మరోవైపు ఫరూక్‌ అబ్దుల్లాను కోర్టు ఎదుట హాజరుపరచాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, జమ్మూకాశ్మీర్‌ అధికార యంత్రాంగానికి నోటీసులు జారీచేసింది. సెప్టెంబరు 30వ తేదీన ఈ పిటిషన్‌ను విచారణకు చేపట్టనున్నట్టు సుప్రీం బెంచ్‌ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments