Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా మాజీ క్రికెటర్ చంద్రశేఖర్ మృతి

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (08:47 IST)
టీమిండియా మాజీ క్రికెటర్ వీ.బీ చంద్రశేఖర్ గుండెపోటతో కన్నుమూశారు. తమిళనాడుకు చెందిన ఆయన భారత జట్టు తరపున కేవలం ఏడు మ్యాచ్‌లు ఆడి.. 53 పరుగులు చేశారు. జాతీయ జట్టులో అంతగా స్థానం లభించకపోయినా.. తమిళనాడు తరపున రంజీ  మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
 
దీనితో పాటు తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కాంచీ వీరన్స్ జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్నారు. దానితో పాటు చెన్నైలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ క్రికెట్ అనే పేరుతో ఓ అకాడమీని ప్రారంభించారు.
 
ఈ నేపథ్యంలో గురువారం గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే  చంద్రశేఖర్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
 
 ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరోవైపు చంద్రశేఖర్ మృతిపట్ల మాజీ టీమిండియా కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీబీ దూకుడైన బ్యాట్స్‌మెన్.. భారత్ తరపున ఆయన ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోవడం దురదృష్టకరం. మేమిద్దరం కలిసి ఎన్నో సార్లు కామెంట్రీ కూడా చేశామని గుర్తు చేసుకున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments