Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (08:40 IST)
పోలవరం నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. భారీ వరద ప్రవాహం, నవయుగ కాంట్రాక్టర్ రద్దుతో పోలవరం పనులు తాత్కాలికంగా ఆగిపోయాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ మొదటి వారం నుంచి పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి అనుగుణంగానే నూతన కాంట్రాక్టర్ ను పిలవాలని నిర్ణయించింది.

రివర్స్ టెండరింగ్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చిన జగన్ సర్కార్.. ఈనెల 17న పోలవరంకు రివర్స్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ ను విడుదల చేయనుంది. పోలవరం హెడ్‌వర్క్స్‌ తోపాటు జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అనుమతితో ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ చేపట్టనుంది.

ఇందులో ఎవరు తక్కువకు కోట్ చేస్తే వారికే పనుల కాంట్రాక్టు ఇవ్వనుంది. ఇటీవల పోలవరం పనులపై విచారించిన నిపుణుల కమిటీ రూ.3,128.31 కోట్ల మేర అవినీతి జరిగినట్లుగా నిర్థారించింది.

ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు రివర్స్‌ టెండరింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం వెళుతోంది. అందులో భాగంగా ప్రస్తుతమున్న కాంట్రాక్టర్ నవయుగను రద్దు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments