Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ 'పద్మ' పురస్కారం నాకొద్దు : బుద్ధదేవ్ భట్టాచార్య

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (10:57 IST)
భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని మంగళవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వీరిరో వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఒకరు. అయితే, ఈయన ఈ పురస్కారాన్ని తిరస్కరించారు. ఈ అవార్డు గురించి తనను ఎవరూ సంప్రదించలేదని, ఎవరూ చెప్పలేదని చెప్పారు. ముందుగా సంప్రదించివుంటే ఖచ్చితంగా ఈ పురస్కారం వద్దని చెప్పేవాడనని తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో సంక్షిప్త ప్రకటన విడుదల చేశారు. 
 
అయితే, కేంద్ర ప్రభుత్వం వాదన మరోలావుంది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి మంగళవారం ఉదయం ఈ అవార్డు విషయమై భట్టాచార్య భార్యతో మాట్లాడినట్టు తెలిపింది. ఇందుకు ఆమె అంగీకరించారని, పౌర పురస్కారానికి ఎంపిక చేసినందుకు హోంమంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు కూడా తెలిపారని హోంశాఖ వివరణ ఇచ్చింది. 
 
కాగా, 77 యేళ్ళ బుద్ధదేవ్ భట్టాచార్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిజానికి పద్మపురస్కారాలను తిరస్కరించడం చాలా చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే వాటిని ప్రకటించడానికి ముందుగానే ఎంపిక చేసిన అవార్డు గ్రహీతల అంగీకారాన్ని తెలుసుకుంటుంది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కూడా పద్మ పురస్కారానికి ఎంపికయ్యారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments