Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో కొట్టుకున్న భార్యాభర్తలు.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

Webdunia
బుధవారం, 29 నవంబరు 2023 (17:05 IST)
జర్మనీ నుంచి థాయ్‌లాండ్ వెళుతున్న విమానంలో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు జట్లు పట్టుకుని కొట్టుకున్నారు. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ఢిల్లీలో ల్యాండింగ్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన నంబరు ఎల్.హెచ్.772 విమానంలో జర్మనీలోని మ్యూనిచ్ నుంచి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాంగ్ వెళుతుంది. 
 
అయితే, ఈ విమానం గాల్లో ఉండగా భార్యాభర్తలు గొడవకు దిగారు. ఈ దంపతులిద్దరూ ఘర్షణపడ్డారు. దీంతో విమానంలో గందరగోళం ఏర్పడింది. భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు దాడికి ప్రయత్నించడంతో వారికి సర్ది చెప్పేందుకు విమాన సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో చేసేది లేక విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు యత్నించారు. 
 
అప్పటివరకు పాకిస్థాన్ గగనతలంపైనే విమానం ప్రయాణిస్తుంది. దీంతో పాకిస్థాన్‌లో ల్యాండింగ్ చేసేందుకు అనుమతి కోరగా, పాక్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ అనుమతి నిరాకరించింది. దాంతో ఆ విమానాన్ని ఢిల్లీ వైపు మళ్లించారు. ఢిల్లీలో అధికారులు అనుమతించడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ వెంటనే భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకోగా, విమానంలో కీచులాడుకున్న దంపతులను వారికి అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments