కండోమ్‌లను వేడి నీటిలో వేసి, ఆ ద్రవాన్ని తాగుతున్నారు.. ఇలా చేస్తే?

Webdunia
బుధవారం, 27 జులై 2022 (11:39 IST)
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఓ విస్తుగొలిపే సంఘ‌ట‌న వెలుగు చూసింది. ఇంత‌కుముందు రోజుకు మూడు నుంచి నాలుగు కండోమ్ ప్యాకెట్లు మాత్ర‌మే అమ్ముడుపోయేవ‌ని, ఇప్పుడు స్టోర్‌లో ఒక్క కండోమ్ ప్యాకెట్ కూడా మిగ‌ల‌డం లేద‌ని ఓ మెడిక‌ల్ షాపు య‌జ‌మాని తెలిపాడు. 
 
అనూహ్యంగా పెరిగిన ఫ్లేవర్డ్ కండోమ్‌ల విక్రయాలు స్థానిక దుకాణదారులను కలవరపెడుతున్నాయి. జిల్లాలో కొంత మంది యువకులు వీటిని గర్భనిరోధక సాధనాలుగా కాకుండా మత్తు పదార్థాలుగా ఉపయోగిస్తున్నారని తేలింది. 
 
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో కొంతమంది విద్యార్థులు కండోమ్‌లను ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు. వారు కండోమ్‌లను వేడి నీటిలో వేసి, ఆ ద్రవాన్ని తాగుతున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ 10 నుంచి 12 గంటల వరకు మ‌త్తు ఉంటుంద‌ని వైద్యులు చెప్తున్నారు. 
 
కండోమ్స్‌ డిమాండ్ గణనీయంగా పెరగడంపై స్థానిక యంత్రాంగం ఆందోళన చెందింది. కాగా, ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇంకా స్పందించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం