Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీని ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసుకుని తింటున్నారా..? ఐదేళ్ల చిన్నారి మృతి..

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (16:33 IST)
హోటల్స్‌లో తీసుకొచ్చిన బిర్యానీని పారేయలేక ఫ్రిజ్‌లో వుంచి మరుసటి రోజు వేడి చేసుకుని ఆరగించే అలవాటున్నవారు మీరైతే.. ఇకపై అలా చేయకండి. అలా చేశారో ప్రాణాలకే ప్రమాదమని చెప్పే ఓ ఘటన తమిళనాడులోని.. వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది. బిర్యానీని మళ్లీ వేడి చేసుకుని తీసుకున్న కారణంగా ఐదేళ్ల చిన్నారి అస్వస్థతకు గురై.. ప్రాణాలు కోల్పోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. వేలూరు జిల్లా అరక్కోణం, తండలం, న్యూ కాలనీకి చెందిన శ్రీనివాసన్-కనక దంపతులు బంధువుల ఇంటి శుభకార్యానికి వెళ్లారు. అక్కడ బిర్యానీ విందు ఏర్పాటు చేశారు. కానీ బిర్యానీ మిగిలిపోవడంతో.. ఈ దంపతులు ఇంటికి తెచ్చుకున్నారు. ఈ బిర్యానీని ఫ్రిజ్‌లో వుంచి.. మరుసటి రోజు మళ్లీ వేడి చేసుకుని.. ఆరగించారు. 
 
శ్రీనివాసన్ కుమార్తె గోపిక అనే ఐదేళ్ల చిన్నారి కూడా ఈ బిర్యానీని తీసుకుంది. మరో నలుగురు చిన్నారులు కూడా బిర్యానీని తీసుకుని అస్వస్థతకు గురైనారు. దీంతో అరక్కోణం ఆస్పత్రిలో గోపికతో పాటు నలుగురు చిన్నారులను చికిత్స నిమిత్తం తరలించారు. 
 
అక్కడ చికిత్స పొందుతూ.. గోపిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బిర్యానిని వేడి చేసి తినడం ద్వారా చిన్నా రి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

ఆంధ్ర కింగ్ తాలూకా లో సినిమా అభిమానిగా రామ్ పోతినేని

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments