Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ శునకం.. 30మందిని కాపాడింది.. కానీ దాని ప్రాణం మాత్రం?

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (16:08 IST)
విశ్వాసానికి మారుపేరు శునకం. అన్నం పెట్టిన యజమానిని అదెప్పుడూ మరిచిపోదు. యజమానిని కాపాడుకోవడానికి ఇంటి ముందు కాచుకు కూర్చుంటుంది. అలా ఇంట పెంచిన ఓ పెంపుడు కుక్క 30 మంది ప్రాణాలు కాపాడింది. ఈ ఘటన యూపీలోని బాందా అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడాన్ని గమనించిన శునకం గట్టిగా మొరగడం మొదలెట్టింది. 
 
దాన్ని అరుపులు విన్న జనం.. ఇళ్లల్లో నుంచి బయటికి వచ్చేశారు. భవనంలో భారీ ఎత్తున మంటలు చెలరేగడం చూసిన జనాలు తమ ప్రాణాలను చేతిలో పట్టుకుని పరుగులు తీశారు. కానీ ఇంతగా 30 మంది ప్రాణాలు కాపాడిన శునకం మాత్రం చివరికి మృతి చెందింది. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు జనం పరుగులు తీశారే కానీ.. ఆ శునకాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. 
 
మంటల ధాటికి సిలిండర్ కాస్త పేలడంతో ఆ శునకం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఈ ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. శునకం గట్టిగా అరుస్తూ అందరినీ కాపాడింది కానీ.. సిలిండర్ పేలడంతో ఆ శునకం మాత్రం నిప్పుకు ఆహుతి అయ్యిందని చెప్పారు. ఇకపోతే.. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తేల్చారు. అగ్నిమాపక సిబ్బంది.. గంటల పాటు పోరాడి మంటలను ఆర్పినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments