Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధామి పట్టణంలో ఒక్కసారిగా కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం

వరుణ్
ఆదివారం, 21 జనవరి 2024 (09:25 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లాకు సమీపంలోని ధామి పట్టణంలో ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటన సిమ్లాకు 26 కిలోమీటర్ల దూరంలో జిరగింది. భారీ వర్షాలు, వరదలకు కొండ చరియలు విరిగిపడిన సమయంలో కొండ రాళ్ళ భవనాన్ని బలంగా ఢీకొట్టాయి. దీంతో భవన్ పునాదులు కదిలిపోవడం వల్ల ఈ భవనం కుప్పకూలిపోయివుంటుందని స్థానిక అధికారులు అభిప్రాయపడుతున్నారు. పైగా, ఈ భవనంలోని ప్రజలను ముందుగానే ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం లేకుండా పోయింది. 
 
ధామి పట్టణంలోని మరహ్వాగ్ ప్రాంతంలో రాజ్‌ కుమార్ అనే వ్యక్తికి సంబంధించి ఐదు అంతస్తుల భవనం ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. రాళ్లు ఈ భవనం గోడలను బలంగా ఢీకొట్టాయి. ఈ క్రమంలో ఇంటిని మరమ్మతు చేయించేందుకు రాజ్ కుమార్ అందరినీ ఖాళీ చేయించారు. 
 
ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భవనం పరిస్థితిని గమనించిన అధికారులు ముందుగానే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. భవనం కూలిపోవడంతో ధామి డిగ్రీ కాలేజీకి వెళ్ళే రహదారి దెబ్బతింది. భవనం కూలిపోయే దృశ్యానికి సంబంధించిన 15 సెకన్ల వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments