Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ రేటెంత? నీవు ఎక్కువగా మాట్లాడకు... రేప్ బాధితురాలితో హోం మంత్రి

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (15:29 IST)
మహారాష్ట్రం హోంమంత్రి దీపక్ కేసర్‌కేర్ నోరు జారారు. తనకు న్యాయం చేయాలంటూ వెళ్లి అత్యాచార బాధితురాలి అమర్యాదగా మాట్లాడి దుర్భాషలాడారు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలు పరిశీలిస్తే, గత యేడాది మే నెలలో థానే జిల్లాలోని కల్యాణ్ ప్రాంతంలో ఏడుగురు వ్యక్తులు ఒక మహిళతో పాటు.. ఆమె మైనర్ కుమార్తెను లాక్కెళ్లి బలవంతంగా అత్యాచారం చేశారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ఆరుగురు నిందితులను వదిలివేసి కేవలం ఒక్కరిపైనే కేసు నమోదు చేశారు. 
 
ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళ మహారాష్ట్ర హోంశాఖ మంత్రి దీపక్ కేసర్‌కర్‌ను కలిశారు. తనకు న్యాయం చేయాలనే కోరేందుకు వెళితే సాక్షాత్తూ మహారాష్ట్ర హోంశాఖ మంత్రి దీపక్ కేసర్‌కర్ తనను దుర్భాషలాడుతూ అమర్యాదగా మాట్లాడారని బాధితురాలు మెరైన్ డ్రైవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
'నీ రేటెంత? నీవు ఎక్కువగా మాట్లాడకు' అని హోంశాఖ మంత్రి దీపక్ కేసర్‌కర్ అన్నారని బాధితురాలు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను అవమానపర్చిన హోంశాఖ మంత్రి దీపక్ కేసర్‌కర్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను బాధిత మహిళ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూకేలో హరి హర వీరమల్లూ గ్రాండ్ సెలబ్రేషన్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments