Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజాముద్దీన్‌ మసీదు ఇమామ్‌పై ఎఫ్‌ఐఆర్: ఢిల్లీ ప్రభుత్వం ఆదేశం

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (07:07 IST)
తన నిర్లక్ష్యపు వ్యవహారంతో కరోనా వ్యాప్తికి కారణమయ్యాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజాముద్దీన్‌లోని ప్రముఖ మసీదు ఇమామ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి మతపరమైన కార్యక్రమాన్ని.. అది కూడా దాదాపు 300 నుంచి 400 మందితో నిర్వహించడమే ఇందుకు కారణం. ఈ కార్యక్రమం ఏ రోజు జరిగిందనే విషయంపై స్పష్టత లేకపోయినప్పటికీ.. మార్చి 15 నుంచి 20 మధ్యలో జరిగిందని తెలిసింది.

ఈ కార్యక్రమానికి మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కజికిస్తాన్ దేశాల నుంచి పలువురు హాజరయ్యారు. వీరితో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరయినట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా హాజరయినట్లు సమాచారం.

ఈ కార్యక్రమానికి హాజరయిన వారిలో తమిళనాడుకు చెందిన ఒకరు కరోనా బారిన పడి మరణించగా.. 10 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో.. ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ కార్యక్రమానికి హాజరయిన వారందరిపై నిఘా పెట్టింది. నిజాముద్దీన్ ప్రాంతంలో దాదాపు వంద మందికి పైగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో.. ఆ ప్రాంతాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.

లక్షణాలు కనిపించిన 163 మందిని ఢిల్లీ ప్రభుత్వం బస్సుల్లో లోక్‌ నాయక్ ఆసుపత్రికి తరలించింది. వారికి కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించారు. మంగళవారం రిపోర్ట్‌లు వచ్చే అవకాశమున్నట్లు వైద్యులు తెలిపారు. వీరిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నారు.

తిరిగి వారి స్వదేశాలకు వెళ్లేందుకు లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో విమాన సర్వీసులు లేకపోవడంతో వారంతా దేశ రాజధానిలోనే ఉన్నారు. కరోనా వైరస్ కేసులు దేశ రాజధాని ఢిల్లీని కలవరపెడుతున్న తరుణంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన ఈ మతపరమైన కార్యక్రమం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments