Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈఎంఐ కట్టలేదని కిడ్నాప్ చేశారు... చివరికి ఏమైందంటే?

Webdunia
శనివారం, 1 జులై 2023 (22:22 IST)
తమిళనాడులో ఘోరం జరిగింది. అప్పు తీసుకున్న వ్యక్తి పట్ల ఫైనాన్స్ కంపెనీ దారుణంగా ప్రవర్తించింది. ఈఎంఐ కట్టలేదని.. సదరు ఫైనాన్స్ కంపెనీ.. ఆతని కుమార్తెను కిడ్నాప్ చేసిన ఘటన తిరునెల్వేలి జిల్లా మారుత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మారుత్తూరు గ్రామానికి చెందిన రాజా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. 
 
ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ. 50 వేలు అతను అప్పు తీసుకున్నాడు. లోన్ తీసుకుని ఈఎంఐలు కట్టాడు. కానీ ఉద్యోగం పోవడంతో డబ్బుల్లేక నానా తంటాలు పడ్డాడు. అయితే అప్పు తీసుకున్న కంపెనీ నుంచి ఒత్తిడి పెరిగింది. 
 
ఓ రోజు ఆ ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి విఘ్నేష్.. లోన్ తీసుకున్న రాజా ఇంటికి వెళ్లాడు. ఎలాగైనా.. ఈఎంఐ వసూలు చేయాలని అనుకున్నాడు. రాజా ఇంటికి వెళ్లి ఆవేశంలో ఆయన 11ఏళ్ల కుమార్తెను కిడ్నాప్ చేశాడు. 
 
రాజా ఇంటికి వచ్చాక కూతురు కనిపించకపోవడంతో అన్ని చోట్లా వెతకడం ప్రారంభించాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాప్‌కు గురైన రాజా కుమార్తెను కాపాడి.. విఘ్నేశ్‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments