Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈఎంఐ కట్టలేదని కిడ్నాప్ చేశారు... చివరికి ఏమైందంటే?

Webdunia
శనివారం, 1 జులై 2023 (22:22 IST)
తమిళనాడులో ఘోరం జరిగింది. అప్పు తీసుకున్న వ్యక్తి పట్ల ఫైనాన్స్ కంపెనీ దారుణంగా ప్రవర్తించింది. ఈఎంఐ కట్టలేదని.. సదరు ఫైనాన్స్ కంపెనీ.. ఆతని కుమార్తెను కిడ్నాప్ చేసిన ఘటన తిరునెల్వేలి జిల్లా మారుత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మారుత్తూరు గ్రామానికి చెందిన రాజా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. 
 
ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ. 50 వేలు అతను అప్పు తీసుకున్నాడు. లోన్ తీసుకుని ఈఎంఐలు కట్టాడు. కానీ ఉద్యోగం పోవడంతో డబ్బుల్లేక నానా తంటాలు పడ్డాడు. అయితే అప్పు తీసుకున్న కంపెనీ నుంచి ఒత్తిడి పెరిగింది. 
 
ఓ రోజు ఆ ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి విఘ్నేష్.. లోన్ తీసుకున్న రాజా ఇంటికి వెళ్లాడు. ఎలాగైనా.. ఈఎంఐ వసూలు చేయాలని అనుకున్నాడు. రాజా ఇంటికి వెళ్లి ఆవేశంలో ఆయన 11ఏళ్ల కుమార్తెను కిడ్నాప్ చేశాడు. 
 
రాజా ఇంటికి వచ్చాక కూతురు కనిపించకపోవడంతో అన్ని చోట్లా వెతకడం ప్రారంభించాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాప్‌కు గురైన రాజా కుమార్తెను కాపాడి.. విఘ్నేశ్‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments